Breaking: తాడేపల్లిగూడెం సభకు పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు

by Disha Web Desk 16 |
Breaking: తాడేపల్లిగూడెం సభకు పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన ఉమ్మడి సభ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సభకు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. మరోవైపు సభకు భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో టీడీపీ, జనసేన జెండాలు సభలో రెపరెపలాడుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన జెండాను చంద్రబాబు, టీడీపీ జెండాను పవన్ కల్యాణ్ ఉపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఉమ్మడి సభ కావడంతో జనసేన, టీడీపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జై టీడీపీ, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. తెలుగు సేన విజయకేతనం పేరుతో సభను నిర్వహిస్తున్నారు.

Read More..

Breaking: ఏపీ ఎన్నికలపై కీలక ప్రకటన

Next Story